BBC News, తెలుగు - హోమ్
ముఖ్యమైన కథనాలు
ఇండియాలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు.. మరో వేవ్ మొదలైందా
గత కొద్ది నెలలుగా భారతదేశంలో కోవిడ్- 19 కేసులు బాగా తగ్గిపోయాయని ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో, మళ్లీ కొన్ని రాష్ట్రాల్లో కేసులు పెరగడం కలవరపెడుతోంది.
‘శోభనం రాత్రి కోసం తెప్పించే స్పెషల్ స్వీట్’
విశాఖ జిల్లా మాడుగుల ప్రాంతం పేరుతోనే ఈ హల్వాకు ఆ పేరు వచ్చింది. రాజకీయ నాయకుల నుంచి సినీ తారల వరకూ చాలా మంది ఈ హల్వాకి అభిమానులే. మాజీ ముఖ్యమంత్రులు ఎన్టీఆర్, వైఎస్సార్, చంద్రబాబు నాయుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ సైతం మాడుగుల వచ్చినప్పుడు హల్వా రుచి చూసిన వారే.
ఈమె లేఖలకు బాలీవుడ్ టాప్ స్టార్లు సంతోషంగా సమాధానం ఇచ్చేవారు
"నా పోస్టులు వైరల్ అయ్యాకే, మాకు అందరికీ ఒక విషయం తెలిసొచ్చింది. ఆమె రాసిన లేఖలు, ఫొటోల సేకరణ నిజంగా ఒక అమూల్యమైన నిధి అని నేను అప్పటివరకూ గుర్తించలేకపోయాను"
భారత్-పాక్ సరిహద్దు: కచ్ నిర్బంధ కేంద్రంలో అయిదుగురు పాకిస్తానీలు ఎలా చనిపోయారు?
భారత్-పాకిస్తాన్ సరిహద్దుకు దగ్గరగా, ముఖ్యంగా భారత్ వైపున్న ప్రాంతం, రాకపోకలకు చాలా కఠినంగా ఉంటుంది. చాలా విశాలంగా ఉండే ఈ ప్రాంతంలో నీళ్లు కూడా దొరకవు, దాంతో పౌరులు చాలాసార్లు దారి తప్పిపోతారు.
ఆడ, మగ రెండు లక్షణాలూ ఉన్న పక్షి
"వీటిలో మగ కార్డినల్ పక్షులు ముదురు ఎరుపు రంగులో ఉండగా ఆడ పక్షులు లేత గోధుమ రంగులో ఉంటాయి. కానీ, ఇలా ఆడామగా రెండు లక్షణాలున్న పక్షులు కనిపించడం జీవితంలో అరుదుగా కలిగే అనుభవం" అని రిటైర్డ్ పక్షి శాస్త్రవేత్త జేమీ హిల్ చెప్పారు.
జమాల్ ఖషోగ్జీ హత్యకు సౌదీ యువరాజు ఆమోదం తెలిపారన్న అమెరికా
"మా అంచనా ప్రకారం సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్... ఇస్తాంబుల్లో ఒక ఆపరేషన్ను ఆమోదించారు. సౌదీ జర్నలిస్ట్ జమాల్ ఖషోగ్జీని సజీవంగా పట్టుకోవడం లేదా చంపడమే ఆ ఆపరేషన్ లక్ష్యం."
'చెక్' సినిమా రివ్యూ: చంద్రశేఖర్ ఏలేటి, నితిన్ 'మైండ్ గేమ్'లో లాజిక్ మిస్సయిందా...
రకుల్ మొదటిసారి అనుకుంటా... గ్లామర్, అందాల ప్రదర్శన లేని సాధారణ లాయర్ పాత్రలో కనపడింది. ప్రియా ప్రకాష్ వారియర్ తెరపై కనిపించేది పదిహేను నిమిషాలే. కానీ కుర్రకారు గుండెలకు ఎక్కుపెట్టిన బాణం లాంటి ఆ పాత్ర, ఇలా మెరిసి అలా మాయమవుతుంది.
చంద్రశేఖర్ ఆజాద్ నిజంగా తనను తాను కాల్చుకొని చనిపోయారా?
నేడు చంద్రశేఖర్ ఆజాద్ వర్థంతి. ఆయన 1931 ఫిబ్రవరి 27న ఆల్ఫ్రెడ్ పార్క్లో ఉపయోగించిన పిస్తోల్ నేటికీ అలహాబాద్ మ్యూజియంలో ఉంది. ఆజాద్ ఈ పిస్తోల్తో తనను తాను కాల్చుకొని మృతి చెందాడని చాలామంది భావిస్తారు.
వీడియో, పారుల్ పార్మర్: 30 అంతర్జాతీయ పతకాలు ఆమె సొంతం, వ్యవధి 3,50
నాలుగు సార్లు వరల్డ్ ఛాంపియన్, రెండు సార్లు ఆసియా క్రీడల్లో స్వర్ణాలు, 30కి పైగా అంతర్జాతీయ పతకాలు గెలిచారు పారుల్ పార్మర్. ఆమె ప్రతిభకు 2009లో అర్జున అవార్డు లభించింది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
టీవీ డిబేట్లో చెప్పు విసిరిన వివాదం: అసలు గొడవ ఎక్కడ మొదలైంది.. ఎవరేమంటున్నారు
నాన్సెన్స్ అని శ్రీనివాసరావు అంటే, మీరు పెయిడ్ ఆర్టిస్టులు అని విష్ణు అన్నారు. అలా వాదన పెరిగింది. అంతలోనే శ్రీనివాసరావు తన చెప్పును చేతితో తీసి విష్ణువర్థన్ రెడ్డి వైపు చూపించడంతో పాటు వెంటనే దాన్ని ఆయనపైకి విసిరారు.
నరసరావుపేట అనూష హత్య: నిందితుడు పోలీసు కస్టడీలో ఉన్నాడా... పరారీలో ఉన్నాడా?
'ప్రేమించలేదని చంపేసిన వాడిని పోలీసులు జాగ్రత్తగా కాపాడుతున్నారు. మా పిల్లను చంపేసినా ఫర్వాలేదా.. వాడిని మేపుతారా..మా పిల్లకు జరిగిన అన్యాయం ఎవరికీ జరగకూడదు. ఎన్ కౌంటర్ చేయాలి. లేదంటే ఉరి తీయాలి.'
బంగ్లాదేశ్ నుంచి వచ్చి నిజామాబాద్లో దొంగ పాస్పోర్టులు తీస్తున్నారు... ఏంటీ దందా?
బోధన్లో ఒకే ఇంటి అడ్రస్తో 37 పాస్పోర్టులు తీశారు. ఒకే అడ్రస్, ఒకే మొబైల్ నంబర్ ఇచ్చినా తేడా రాకుండా... స్పెషల్ బ్రాంచ్ పోలీసు అధికారులతోనూ కుమ్మక్కయ్యారు.
ఘట్కేసర్ ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య: తప్పెవరిది, అమ్మాయిలదా.. తల్లిదండ్రులదా.. సమాజానిదా? :అభిప్రాయం
ఈ సమాజం భౌతికంగా , భావజాలపరంగా, ఆధ్యాత్మిక పరంగా తన స్వరూప స్వభావాలను మార్చుకునే దిశగా అడుగులు వేస్తోంది. మనం మానవ సమాజం అనుకుంటున్నదిప్పుడు మానవానంతర సమాజంగా మెల్లగా మారిపోతోంది.
అమ్మ స్తనంపై పాము కాటు.. బిడ్డకు పాలిస్తుండగా ఘటన, మృతి - ప్రెస్ రివ్యూ
మంగళవారం రాత్రి అందరూ నిద్రపోతుండగా, పాప ఆకలితో ఏడ్చింది. దీంతో తల్లి శ్రుతి ప్రమోద్ భోయర్ (21)కు బిడ్డకు పాలివ్వడం మొదలు పెట్టారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన పాము...శ్రుతి రొమ్ముపై కాటేసింది.
విజయవాడ టీడీపీలో ఎంపీ వర్సెస్ ఎమ్మెల్సీ.. మేయర్ పీఠం కోసమేనా
‘‘కేశినేని నానితో కలిసి పనిచేయడానికి మాకేమీ ఇబ్బందులు లేవు. అధినేత మాటే మాకు శిరోధార్యం. టీడీపీ విజయానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తాం. విజయవాడ కార్పొరేషన్లో మరోసారి మా జెండా ఎగురుతుంది. వివాదాలకు తావు లేకుండా అందరూ ముందుకు సాగాలి’’ అన్నారు బుద్ధా వెంకన్న.
కోవిడ్ భారిన పడ్డ ప్రొఫెసర్ సాయిబాబా.. గొంతు, ఊపిరితిత్తులకు తీవ్రమైన ఇన్ఫెక్షన్ - Newsreel
ప్రొఫెసర్ జీ.ఎన్ సాయిబాబాకు కోవిడ్ సోకడంతో తీవ్రమైన దగ్గు, జలుబుతో బాధపడుతున్నట్టు నాగ్పూర్ మెడికల్ కాలేజీ హాస్పిటల్ నిర్ధరించింది.
‘ప్రచారానికి వెళ్తే పేరంటానికా అని ఎగతాళి చేశారు... మగవాళ్లందరినీ ఓడించాం’
గెలిచినవారిలో పీజీలు చేసినవారు ఇద్దరు ఉంటే...అసలు బడి ముఖం చూడని వారు ముగ్గురున్నారు. అయితే వారు కూడా సంతకం పెట్టడం నేర్చుకున్నారు. పంచాయితీ ఆఫీసు రిజిస్టర్లో సంతకం చేసి సంబరపడ్డారు.
వైఎస్ షర్మిల: నాకు పదవి ఎందుకు ఇవ్వలేదో జగన్నే అడగండి -News Reel
''నేను పార్టీ పెట్టడం మా అన్నకు ఇష్టం లేదు. మా అనుబంధాల్లో ఎలాంటి తేడాలుండవు. మాటలు, అనుబంధాలు, రాఖీలుంటాయి. మా మధ్య ఉన్నవి విబేధాలో.. భిన్నాభిప్రాయాలో నాకు తెలియదు. నాకు పదవి ఎందుకు ఇవ్వలేదో జగన్నే అడగండి."
కాకినాడ సెజ్ భూములు మళ్లీ రైతులకే, ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు
కాకినాడ సెజ్ పరిధిలో ప్రభుత్వం నుంచి పరిహారం తీసుకోకుండా భూముల కోసం పోరాడుతున్న రైతులకు వాటిని తిరిగి అప్పగించాలని ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి నిర్ణయించింది.
కరోనావైరస్ - ప్రత్యేక కథనాలు
ప్రపంచవ్యాప్తంగా అందరికీ కోవిడ్-19 వ్యాక్సీన్ అందుబాటులోకి రావడం సాధ్యమేనా?
కోవిడ్ వ్యాక్సీన్ అందరికీ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే ప్రశ్న చాలా మందిని వేధిస్తోంది. కొన్ని దేశాలు ఈ టీకా పంపిణీకి కొన్ని నిర్దేశిత లక్ష్యాలు పెట్టుకున్నాయి. కానీ, చాలా దేశాలలో ఈ అంశంపై ఇంకా పూర్తి స్పష్టత లేదు.
కరోనావైరస్: భారతదేశంలో మహమ్మారి వ్యాప్తి ముగింపు దశకు చేరుకుందా?
కోవిడ్-19 వల్ల లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతారని తొలినాళ్లలో చాలా మంది నిపుణులు జోస్యం చెప్పిన ఈ దేశంలో కరోనా మహమ్మారి స్థిరంగా తిరోగమిస్తోందా?
కరోనావైరస్ గురించి మొదట ప్రపంచానికి చాటి కేసులు ఎదుర్కొన్న చైనా డాక్టర్ వర్థంతి... నివాళులర్పించిన ప్రజలు
ప్రజాగ్రహం పతాకస్థాయికి చేరటంతో డాక్టర్ లీ మీద బనాయించిన కేసులను ఎత్తివేసి, ఆయనను ధీరోదాత్తుడుగా గౌరవించింది చైనా ప్రభుత్వం.
కోవిడ్-19: చిన్న వయసులోనే తోడు కోల్పోయి ఒంటరైన జీవితాలు
తోడును కోల్పోవడమే కాదు కొత్తగా ఎదురయ్యే బాధ్యతలను మోయడం అనే భయం కొందరిని కుంగదీస్తోంది. అందుకే సాటి వారికి అండగా ఉండేందుకు సోషల్ గ్రూపులు బాధితులకు ఉపకరిస్తున్నాయి.
వ్యాక్సీన్ తీసుకున్న వారి నుంచి ఇతరులకు కరోనావైరస్ సోకుతుందా
వ్యాక్సీన్ వలన రెండు రకాల రోగ నిరోధక శక్తి వస్తుంది. ఒకటి, రోగాన్ని ముదరనివ్వకుండా పాథోజెన్ ని నిరోధించే ప్రభావవంతమైన రోగ నిరోధక శక్తి. మరొకటి వైరస్ లక్షణాలు కనపడకుండా చేయడం మాత్రమే కాకుండా వైరస్ ని పూర్తిగా చంపి, ఇన్ఫెక్షన్ పూర్తిగా సోకకుండా చూడగలిగే రోగ నిరోధక శక్తి.
కరోనావైరస్: పిల్లలపై కోవిడ్ మహమ్మారి తీవ్రమైన ప్రభావం చూపుతోందా
కోవిడ్ బాధితులు అంటే కేవలం వైరస్ బారిన పడి ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నవారే అనుకుంటారు. కానీ వైరస్ ప్రభావం నేరుగా లేకపోయినా భారీగా బాధిత వర్గం ఒకటుంది. వారే చిన్నారులు.
మీరు కరోనాసోమ్నియాతో బాధపడుతున్నారా.. దీన్ని ఎదుర్కోవడం ఎలాగో తెలుసా
కోవిడ్ మహమ్మారి సమయంలో చాలా మంది నిద్రలేమితో బాధపడుతున్నారు. దీనికి నిపుణులు కరోనాసోమ్నియా లేదా కోవిడ్ సోమ్నియా అనే పేరును పెట్టారు. దీనిని ఎదుర్కోవడం ఎలా?
వీడియో, కరోనావైరస్ సోకినా కొందరిలో ఏ లక్షణాలూ కనిపించకపోవడానికి కారణాలేంటి?, వ్యవధి 3,04
కొందరి శరీరంలో కరోనా వైరస్ ప్రవేశించినా వారిలో ఎలాంటి మార్పులూ కలగడం లేదు. దీనికి కారణమేంటని పరిశోధనలు జరుగుతున్నాయి.
కోవిడ్-19: సింగిల్ డోస్ వ్యాక్సీన్ ఎంత వరకు పని చేస్తుంది ? రెండో డోస్ తీసుకోకపోతే ఏమవుతుంది ?
వ్యాక్సీన్ తీసుకున్నా, తీసుకోక ముందు ఎలా ఉన్నానో అలాగే ఉండాలి. దీనికి రెండు కారణాలున్నాయి. మొదటిది మనకు పూర్తి స్థాయి రక్షణ ఇంకా లభించలేదు. రెండోది ఈ వ్యాక్సీన్ వైరస్ను ఆపుతుందనిగానీ, ఇతరులకు వ్యాపించకుండా నిరోధిస్తుందనిగానీ గ్యారంటీ లేదు.
కరోనా సోకిన వారికి రోజుకు రూ.7 వేలు ఇస్తున్న ప్రభుత్వం.. వారితో ఉన్న వారికి భత్యం, ప్రోత్సాహకాలు కూడా..
కోవిడ్ సోకినవారు తమంతట తాముగా క్వారంటీన్ పాటించడానికి ఆ దేశాల ప్రభుత్వాలు ఎలాంటి ప్రోత్సాహకాలను అందిస్తున్నాయి?
జాతీయం
బాలాకోట్ వైమానిక దాడికి రెండేళ్లు.. ఈ ప్రశ్నలకు భారత్, పాక్ రెండు దేశాల దగ్గరా సమాధానాలు లేవు
పాకిస్తాన్లోని బాలాకోట్లో భారత్ వైమానిక దాడులు చేసి రెండేళ్లు అవుతోంది. అయితే, ఆ దాడులకు సంబంధించి ఇప్పటికీ కొన్ని ప్రశ్నలకు భారత్, పాకిస్తాన్ల నుంచి సమాధానాలు రాలేదు.
దిల్లీ అల్లర్లకు ఏడాది: తగలబడిన రెండు ప్రార్థనా స్థలాల కేసులను పోలీసులు ఏం చేశారు
ఫారూకియా మసీదులో కాల్పులు, హింసకు సంబంధించి దయాళ్పూర్ స్టేషన్లో పోలీసులు ఫిబ్రవరి 26, 2020న ఎఫ్ఐఆర్-64ను నమోదు చేశారు. కాని పీసీఆర్ కాల్ ద్వారా సబ్ ఇన్స్పెక్టర్ రామ్ ప్రకాశ్కు వచ్చిన సమాచారం ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదైంది.
గ్యాంగ్ రేప్ నిందితుడు పోలీసులకు దొరక్కుండా 22 ఏళ్లు ఎలా తప్పించుకు తిరిగాడు?
“మమ్మల్ని చూసి పారిపోవాలని చూశాడు. కానీ, దొరకగానే, నన్నిక్కడి నుంచి తీసుకెళ్లండి, అన్ని విషయాలు చెబుతాను అన్నాడు” అని భువనేశ్వర్ పోలీస్ కమిషనర్ సుధాంశు సారంగి బీబీసీతో అన్నారు.
భారత్ అర్జున్ ఎంకే-1ఏ యుద్ధ ట్యాంకులు పాకిస్తాన్ ట్యాంకుల కన్నా మెరుగైనవా?
అర్జున్ ఎంకే-1ఏ భారత్లోనే తయారవుతున్నాయి. ఇదివరకటి అర్జున్ ఎమ్-కే1ఏకు మార్పులు చేసి, వీటిని రూపొందించారు. ఎంకే-1ఏలో వాడిన భాగాల్లో 54.3 శాతం దేశీయంగా తయారైనవే.
దిల్లీ అల్లర్లలో మరణించిన అంకిత్ శర్మ, రతన్లాల్ కుటుంబాలు ఇప్పుడెలా ఉన్నాయి
“మా అన్నను చంపి కాలువలో వేసిన వీడియోను దృశ్యాలను మా కుటుంబం అంతా చూశాం. ప్రపంచమంతా చూసింది. ఆయన్ను చాలా ఘోరంగా హత్య చేశారు” అన్నారు అంకుర్.
నీరవ్ మోదీని భారత్కు అప్పగించాలంటూ తీర్పు చెప్పిన బ్రిటన్ కోర్టు
పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో ప్రధాన నిందితుడు నీరవ్ మోదీని భారత్కు అప్పగించాలని బ్రిటన్ కోర్టు తీర్పు ఇచ్చింది.
‘రెండు కాళ్లూ కట్టేసి గోళ్లు పీకేశారు.. మూడు రోజుల పాటు నిద్రపోనివ్వలేదు’
గత నెలలో పోలీసులు అరెస్ట్ చేసిన మజ్దూర్ అధికార్ సంఘటన్ ప్రెసిడెంట్ శివ్ కుమార్ (24) ఒంటి నిండా తీవ్ర గాయాలున్నాయని వైద్య నివేదిక తెలిపింది.
వీడియో, పెట్రోల్ కోసం ట్యాంకులు, డ్రమ్ములు పట్టుకొని నేపాల్ వెళ్తున్నారు, వ్యవధి 2,39
నేపాల్ సరిహద్దుకు సమీపంలో భారత భూభాగంలో ఉన్న పెట్రోల్ పంపుల్లో అమ్మకాలు క్షీణించాయి. దీనికి కారణం భారత్ కన్నా నేపాల్లో పెట్రోల్ చౌకగా దొరకడంతో సరిహద్దుల వెంబడి అక్రమ రవాణాలు పెరిగిపోవడమే.
పెట్రోల్, గ్యాస్ ధరల వల్ల మీ జేబుపై ఎంత భారం పడుతుంది
ప్రజలు తాము కొంటున్న పెట్రోల్లో 60 శాతం మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పన్ను రూపంలో చెల్లిస్తుండగా.. డీజిల్పై 54 శాతం చెల్లిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోలుపై రూ.32.90, డీజిల్పై రూ.31.80 పన్ను విధిస్తోంది.
ముఖేష్ అంబానీ నివాసం సమీపంలో పేలుడు పదార్థాల కలకలం
ముంబయిలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ నివాసం సమీపంలో పేలుడు పదార్థాలు కలిగిన స్కార్పియో కారు కలకలం రేపింది. ఆ వాహనంలో 20 జిలెటిన్ స్టిక్స్ లభ్యమయ్యాయని మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ తెలిపారు.
బీబీసీ ప్రపంచం
చూడండి, బీబీసీ ప్రపంచం
అండమాన్ సముద్ర జలాల్లో చిక్కుకున్న వందలాది రోహింజ్యాలు...రక్షించేందుకు అత్యవసర చర్యలు తీసుకోవాలన్న ఐక్యరాజ్యసమితి; అమెజాన్ అడవుల్లో అక్రమంగా చేజిక్కించుకున్న భూముల్ని ఫేస్బుక్లో అమ్మకానికి పెడుతున్న సంఘటిత ముఠాలు; మూడేళ్ల వయస్సులో పోలియో సోకినా నాలుగు సార్లు ప్రపంచ ఛాంపియన్గా సత్తా చాటిన పారా బాడ్మింటన్ ప్లేయర్ పారుల్ పర్మార్; దృఢ సంకల్పంతో కష్టాలను జయించి స్టంట్ మ్యాన్గా మారిన మషూద్ ఆలం ....బీబీసీ ప్రపంచంలో
BBC ISWOTY - క్రీడల్లో భారతీయ మహిళలు
బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ ఉమన్ ఆఫ్ ద ఇయర్-2020: ముగిసిన ఓటింగ్... విజేతను ప్రకటించేది ఎప్పుడంటే
భారత్తో పాటు వివిధ దేశాల్లో ఉన్న ప్రజలు ఈ ఓటింగ్లో పాల్గొన్నారు. పురస్కారం కోసం పోటీలో ఉన్న ఐదుగురు నామినీల్లో తమకు ఇష్టమైనవారికి ఓటు వేశారు.
వీడియో, ‘రూ.180 షూస్తో పోటీలకు వెళ్లి పతకాలు గెలిచాను’, వ్యవధి 4,10
ఆమె రెండు కాళ్లకూ ఆరేసి వేళ్లుంటాయి. రూ. 180 షూస్తో పోటీల్లో పాల్గొనేవారు. హెప్టాథ్లాన్లో భారతదేశానికి స్వర్ణ పతకం సాధించారు. ఇప్పుడు ఒలింపిక్స్ లో పతకం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు.
వీడియో, ‘‘ఆ క్షణం వెనక్కి వస్తే దేశానికి పతకం సాధించే రావాలని అనిపించింది’’, వ్యవధి 4,32
‘‘వాళ్లు మాములుగానే ఉన్నారు. నేనూ మాములుగానే ఉన్నాను. కానీ వాళ్లంతా నాపై ఎందుకు వివక్ష చూపిస్తారో అర్థంకాదు.’’ పారా ఒలింపిక్ స్కేటర్ ప్రియాంకా దేవన్ ప్రశ్నకు మీ దగ్గరైనా సమాధానం ఉందా?
ISWOTY: వికీపీడియాలో 50 భారత మహిళా క్రీడాకారుల ప్రొఫైల్స్ చేర్చిన విద్యార్థులు
భారతదేశంలో ఆరు భాషలకు చెందిన విద్యార్ధులతో కలిసి ఈ 50 మంది విజయవంతమైన, వర్ధమాన క్రీడాకారిణుల జీవిత కథలను వికీపీడియాలో చేర్చేందుకు బీబీసీ ప్రయత్నించింది.
వీడియో, సారికా కాలే: 'డబ్బులు లేక ఒక్క పూటే తినేదాన్ని.. అయినా ఖోఖో ఆపలేదు.. ఖోఖో నా ప్రాణం', వ్యవధి 4,12
దేశంలోని మారుమూల గ్రామాల్లో ఉన్న అమ్మాయిలకు క్రీడల్లోకి రావడం-రాణించడం అనేది ఇప్పటికీ సుదూర స్వప్నమే. మహారాష్ట్రలోని చిన్న ఊరు ఉస్మానాబాద్లో నిరుపేద కుటుంబం నుంచి వచ్చి ఖోఖోలో అసమాన ప్రతిభతో రాణించిన సారికా కాలే కథ ఇది.
వీడియో, బీబీసీ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు - ఒక్కో నామినీది ఒక్కో కథ, వ్యవధి 2,24
షూటర్ మను భాకర్, స్పింటర్ ద్యుతీ చంద్, చదరంగ క్రీడాకారిణి కోనేరు హంపి, భారత హాకీ టీమ్ కెప్టెన్ రాణి, రెజ్లర్ వినేశ్ ఫోగట్ ఈ ఏడాది ISWOTY నామినీలుగా ఎంపికయ్యారు. వారేమంటున్నారో చూడండి.
వీడియో, వినేశ్ ఫోగట్: 'ఇప్పుడు ఆడపిల్ల పుడితే రెజ్లర్ అవుతుందిలే అంటున్నారు', వ్యవధి 3,02
రియో ఒలింపిక్స్లో పతకం ఖాయం అనుకునే సమయంలో కాలికి గాయమైంది. గత ఏడాది కోవిడ్తో పోరాడారు. ఇప్పుడు టోక్యో ఒలింపిక్స్లో పతకమే లక్ష్యంగా దూసుకెళ్తున్నారు.
వీడియో, కోనేరు హంపి: 'అమ్మాయి కదా... గ్రాండ్ మాస్టర్ కాగలదా అని అనేవారు', వ్యవధి 2,52
ప్రసూతి విరామం తర్వాత రీఎంట్రీ ఇచ్చిన ఈ గ్రాండ్ మాస్టర్ 2019లో మరోసారి వరల్డ్ ఛాంపియన్గా నిలిచారు.
బీబీసీ స్పోర్ట్స్ హ్యాకథాన్: ఏంటీ కార్యక్రమం... అసలేం చేయబోతున్నారు?
బీబీసీ చేపట్టిన 'ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్' ప్రాజెక్టులో భాగంగా ఈ హ్యాకథాన్ జరుగుతోంది. 50 మంది క్రీడాకారిణుల గురించి వికీపీడియాలో విద్యార్థులు కొత్త పేజీలు సృష్టించనున్నారు.
వీడియో, ద్యుతీ చంద్: ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ నామినీ పరుగుల ప్రయాణం, వ్యవధి 2,57
బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ 2020 నామినీల్లో ఒకరైన ద్యుతీచంద్, రాబోయే ఒలింపిక్స్లో పతకమే లక్ష్యంగా పరుగులు పెడుతున్నారు.
అంతర్జాతీయం
ఉత్తర కొరియా బొగ్గు గనుల్లో బానిసలుగా మగ్గిపోతున్న దక్షిణ కొరియా యుద్ధ ఖైదీలు
ఉత్తర కొరియా పాలకులు ఆయుధ కార్యక్రమాలకు డబ్బు సంపాదించుకునేందుకు దక్షిణ కొరియా యుద్ధ ఖైదీలను కొన్ని తరాలుగా ఆ దేశపు బొగ్గు గనుల్లో బానిసలు పని చేయిస్తున్నట్లు ఒక మానవ హక్కుల సంస్థ విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. ఆ నివేదికను బీబీసీ నిశితంగా పరిశీలించింది.
కరోనావైరస్ ఆ తెగలో ఆఖరి పురుషుడిని కూడా బలి తీసుకుంది...
20వ శతాబ్దం మొదట్లో 15 వేలుగా ఉన్న జుమా తెగ జనాభా చివరి దశాబ్దానికి ఆరుకు పడిపోయింది. ఈ తెగలో మిగిలి ఉన్న ఒకే ఒక్క పురుషుడైన అరుకా జుమా గత వారం చనిపోయారు.
భారత్కు మద్దతు ఇస్తాం, కలిసి పనిచేస్తాం: చైనా
బ్రిక్స్ సమావేశం నిర్వహించడంలో భారత్కు సహకరిస్తామని చైనా తెలిపింది. భారత్, చైనాల మధ్య సరిహద్దుల విషయంలో పదవ రౌండ్ చర్చల తరువాత చైనా ఈ ప్రకటన చేసింది.
నైజీరియాలో 300 మందికిపైగా విద్యార్థినుల కిడ్నాప్
నైజీరియాలోని వాయువ్య భాగంలో ఉన్న జంఫారా రాష్ట్రంలో కొన్ని వందల మంది స్కూలు విద్యార్థులు శుక్రవారం అపహరణకు గురయ్యారు.
శ్రీలంక పార్లమెంటులో ఇమ్రాన్ ఖాన్ ప్రసంగం రద్దవడానికి ఇండియా కారణమా
‘పాకిస్తాన్ సహా ఇస్లామిక్ దేశాలపై శ్రీలంక ముస్లింలు ఆశలు పెట్టుకుంటే... వారి పరిస్థితి కూడా పాలస్తీనా, వీగర్, రోహింగ్యాల్లాగే మారుతుంది. ఇస్లామిక్ దేశాలు వాళ్లందరినీ వారి దారిన వారిని వదిలేశాయి’
వైలెట్ గిబ్సన్: ముస్సోలినీపై పాయింట్ బ్లాంక్ రేంజిలో కాల్పులు జరిపిన మహిళ
"అదే పని ఒక మగాడు చేసుంటే, బహుశా అతడికి ఒక విగ్రహమో, ఇంకేదో పెట్టుండేవారు. మహిళ కాబట్టి ఆమెను బంధించి ఉంచారు".
పాకిస్తాన్: పాత అప్పులు తీర్చేందుకు కొత్త అప్పులు చేయాల్సి వస్తోందా
ప్రస్తుతం పాకిస్తాన్ విదేశీ రుణాలు 115 బిలియన్ డాలర్లకు పైనే ఉన్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ గణాంకాల ప్రకారం.. 2020 డిసెంబర్ 31 నాటికి పాకిస్తాన్ మొత్తం అప్పు 115.756 బిలియన్ డాలర్లు.
'పెళ్లైతే భర్త పేరు తగిలించుకోవాలా?': పాకిస్తాన్ అమ్మాయిల్లో మారుతున్న ట్రెండ్
పెళ్లి తర్వాత భార్య... భర్త పేరును గానీ భర్త ఇంటిపేరును గానీ తన పేరు చివర పెట్టుకునే సంప్రదాయం చాలా దేశాల్లో ఉంది. అయితే, ఈ సంప్రదాయాన్ని పాటించకూడదని నిర్ణయించుకుంటున్న అమ్మాయిల సంఖ్య పాకిస్తాన్లో ఇటీవల పెరుగుతోంది.
'నా విమానంలో లిఫ్ట్ ఇస్తా.. రెండు గంటల్లో మీ ఇంట్లో దించేస్తా' అని కిమ్కు ట్రంప్ ఆఫర్ ఎలా ఇచ్చారు
ట్రంప్– కిమ్ భేటీలో చోటుచేసుకున్న కొన్ని సన్నివేశాలు ప్రముఖ రాయబారులను సైతం నిర్ఘాంతపరిచాయి. ఉత్తర కొరియా పాలకుడు కిమ్కు తన అధికారిక విమానం 'ఎయిర్ ఫోర్స్ వన్'లో లిఫ్ట్ ఇస్తానని ట్రంప్ ఆఫర్ ఇవ్వటం అందులో ముఖ్యమైన విషయం.
వీడియో, విమానం ఇంజిన్లో మంటలు: శకలాలు వీధుల్లో, పార్కుల్లో పడిపోయాయి, వ్యవధి 2,07
బయల్దేరిన కొద్దిసేపటికే విమానం కుడి ఇంజిన్కు నిప్పంటుకోవడంతో ఆకాశంలో ఇలా దట్టమైన పొగలు వ్యాపించాయి. అమెరికాలోని డెన్వర్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి యునైటెడ్ ఎయిర్లైన్స్ విమానం బయల్దేరిన కొన్ని సెకన్లకే ఈ ఘటన సంభవించింది.