బౌలింగ్ చేస్తూ ప్రాణాలు కోల్పోయిన హైదరాబాదీ
లాయిడ్ ఆంథోనీ అనే పాతికేళ్ల యువకుడు బౌలింగ్ చేస్తూ ప్రాణాలు కోల్పోయారు.
ఈ విషయంపై ఎలాంటి కేసూ నమోదు చేయలేదని, ఆంథోనీ తల్లిదండ్రులు కూడా ఎలాంటి ఫిర్యాదు చేయలేదని బంజారాహిల్స్ పోలీసులు చెప్పారు.
వారందించిన వివరాల ప్రకారం.. శుక్రవారం రాత్రి బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని జహీరనగర్లో క్రికెట్ టోర్నమెంట్ జరిగింది. అందులో ఆంథోనీ బౌలింగ్కు వచ్చారు.
మూడు బంతుల్ని వేసిన అతను ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు. చక్కగా బౌలింగ్ చేస్తున్నావంటూ సహచర క్రికెటర్లు అతన్ని అభినందించటం వీడియోలో వినిపిస్తోంది.
అయితే, నాలుగో బంతిని విసిరేందుకు రెండడుగులు వేసిన ఆంథోనీ ఉన్నట్టుండి ముందుకు పడిపోయారు.
ఏం జరిగిందో అర్థంకాని మిగతా క్రికెటర్లంతా అతని వద్దకు వెళ్లారు. అయితే, ఆంథోనీ చుట్టూ గుమి కూడవద్దని, గాలి ఆడేలా చూడాలని మైక్లో అనౌన్స్ చేస్తున్నట్లు వీడియోలో వినిపిస్తోంది.
సహచర క్రికెటర్లు అతన్ని దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారని, ఆస్పత్రికి వచ్చేప్పటికే ఆంథోనీ గుండెపోటుతో మరణించారని డాక్టర్లు ధృవీకరించినట్లు పోలీసులు చెప్పారు.
ఆంథోనీ ఏడేళ్లుగా క్రికెట్ ఆడుతున్నారని, ప్రతి వారం కనీసం నాలుగు గంటలు క్రికెట్ ప్రాక్టీస్ చేస్తారని ఆంథోనీ స్నేహితుడు రాజు బీబీసీ ప్రతినిధి సంగీతం ప్రభాకర్కు తెలిపారు.
ఆంథోనీ ఒక ప్రైవేటు కంపెనీలో పనిచేస్తుండేవారు. జహీరనగర్లో గత పదేళ్లుగా ఈ క్రికెట్ టోర్నమెంట్ జరుగుతోందని రాజు వెల్లడించారు. ఆంథోనీకి అంతకు ముందు మరే ఇతర ఆరోగ్య సమస్యలూ లేవని ఆయన చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- మిథాలీ మా మోడల్ అంటున్న హైదరాబాదీ అమ్మాయిలు
- BBC SPECIAL: అంధులు క్రికెట్ ఎలా ఆడతారు?
- కాలు లేకపోయినా క్రికెట్లో సూపర్స్టార్
- ఆటోడ్రైవర్ కొడుకు టీ20కి ఎంపిక
- స్కేటింగ్ సునామీ: ఈ పాప వయసు 6, పతకాలు 64
- లైఫ్స్టైలే వినోద్ కాంబ్లీ ఫెయిల్యూర్కు కారణమా?
- రోహిట్: ఏంటా వేగం.. ఏంటా బాదుడు?
- నెహ్రా నీ స్వింగ్ను ఎలా మరిచిపోగలం
- విరాట్ కోహ్లీ: అవును.. అనుష్కతో నా పెళ్లయ్యింది
- భారత్ జిందాబాద్ అన్న పాకిస్తానీ అరెస్టు
- రోహిత్ లాంగ్ ఇన్నింగ్స్ రహస్యమేంటి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి)