దళితుల పట్ల చింతమనేని వ్యాఖ్యలపై నిరసనలు... వెంటనే అరెస్ట్ చేయాలని దళిత సంఘాల డిమాండ్
పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన చింతమనేని ప్రభాకర్ ఎస్సీలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాజకీయంగా పెద్ద చర్చకు తెర తీశాయి.
గతంలో ఇసుక రవాణా విషయంలో తహాశీల్దార్ వనజాక్షి పట్ల దురుసుగా ప్రవర్తించి ఆయన పెను దుమారం రేపారు.
ఆ తర్వాత అంగన్ వాడీ మహిళలు, ఫారెస్ట్ అధికారులు, చివరకు బేవరేజెస్ గొడౌన్ లో పనిచేస్తున్న జాన్ అనే కార్మికుడి విషయంలోనూ చింతమనేని తీరు మీద తీవ్ర విమర్శలు వచ్చాయి.
ఇప్పుడు ఎస్సీలనుద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలపై దళిత సంఘాలు ఆందోళనలు కూడా ప్రారంభించాయి. చింతమనేనిని అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నాయి.
ఇవి కూడా చదవండి:
- తెలంగాణ మంత్రివర్గం: ఈసారీ కనిపించని మహిళలు.. ‘మహిళలు ఇంట్లో ఉండట’మే కారణమా?
- కశ్మీర్: సీఆర్పీఎఫ్ జవాన్లపై ఆత్మాహుతి దాడి, 34 మంది మృతి
- ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ భవనం: ఆకాశ హర్మ్యాలు ఇలా నిర్మిస్తారు
- సైస్స్ ఆఫ్ లవ్: ప్రేమంటే ఏమిటి? మీరిప్పుడు ప్రేమలో ఉన్నారా?
- ప్రేమలేఖ: ఆ మోహపు మైమరపు ప్రేమే కదా...
- ప్రధాని మోదీని రాహుల్, ప్రియాంక పొగిడారా...
- అమ్మాయిల కన్యత్వానికి, సీసా సీల్కు ఏమిటి సంబంధం
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)