సీమ కరువు హంద్రీనీవా పథకంతో తీరేనా

సీమ కరువు హంద్రీనీవా పథకంతో తీరేనా

కృష్ణా జలాలను రాయలసీమకు అందించటంలో భాగంగా కర్నూలు జిల్లాలోని హంద్రీ , చిత్తూరు జిల్లాలోని నీవా నదులను అనుసంధానించటానికి 1989లో అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు శ్రీకారం చుట్టారు.

హంద్రీ నీవాలను అనుసంధానించటానికి కర్నూలు జిల్లా మల్యాల వద్ద హంద్రీ నీవా సుజల స్రవంతి పేరుతో ఎత్తిపోతల పథకానికి ఎన్టీఆర్ పునాది రాయి వేశారు.

కానీ 2004 వరకు ఈ పథకంలో ఎటువంటి పురోగతి లేదని, వైఎస్ రాజశేఖర రెడ్డి 2004లో ముఖ్యమంత్రి అయ్యాకనే ఈ పథకానికి ప్రాణం వచ్చిందని వైసీపీ నేతలు చెబుతున్నారు.

వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత మెుదటి దశ పనుల ప్రారంభించడానికి రూ.1,305 కోట్లు కేటాయిస్తూ పరిపాలన అనుమతులు ఇచ్చారు.

2006లో మెుదటి దశ పనులు ప్రారంభమయ్యాక.. 2007 జనవరిలో అంచనాలు సవరించి రూ.2,774 కోట్లు కేటాయించారు.

ఇక రెండో దశ పనులకుగాను 2005లో అప్పటి సీఎం వైఎస్సార్ రూ.1,880 కోట్లు కేటాయించారు. 2007లో సవరించిన అంచనాల ప్రకారం రూ.4,076 కోట్లు కేటాయించారు.

చంద్రబాబు నాయుడు సీఎం అయ్యాక మరోసారి అంచనాలను సవరించి 2016 ఫిబ్రవరిలో 4317.49 కోట్లు కేటాయించారని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)