పొరపాటున వేరే పార్టీకి ఓటేసి వేలు కోసుకున్న యువకుడు

ఫొటో సోర్స్, yogeshkumarsing
ఒక పార్టీకి ఓటు వేయాలనుకుని పొరపాటున మరో పార్టీకి ఓటు వేసినందుకు తనను తాను శిక్షించుకున్నాడు ఓ యువకుడు.
ఉత్తర ప్రదేశ్లోని బులంద్శహర్కు చెందిన పవన్ కుమార్ ఏప్రిల్ 18న జరిగిన రెండో దశ పోలింగ్లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.
అయితే, ఈవీఎంపై ఉన్న రకరకాల గుర్తులు చూసి కన్ఫ్యూజ్ అయి అనుకోకుండా కమలం గుర్తు(బీజేపీ) నొక్కేశారు.
తాను కోరుకున్న పార్టీకి కాకుండా వేరే పార్టీకి ఓటేశానన్న బాధతో ఆయన తన వేలిని కోసుకున్నారు.
ఈ విషయం చెబుతూ సోషల్ మీడియాలో ఆయన వీడియో పోస్ట్ చేయగా అదిప్పుడు వైరల్గా మారింది.
''నేను ఏనుగు గుర్తు(బీఎస్పీ)కు ఓటేయాలనుకుని వెళ్లాను. కానీ, పొరపాటున ఈవీఎంలో కమలం గుర్తుపై నొక్కాను'' అంటూ ఆయన ఆ వీడియోలో చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- 'మాయావతి 2006లోనే ఎందుకు బౌద్ధం స్వీకరించలేదు?'
- ఉత్తరాంధ్ర: కనీస సౌకర్యాలను నోచుకోని గిరిజన పల్లెలు
- ‘నా పోరాటం దేశం కోసం.. వీవీప్యాట్ స్లిప్పుల్లో 50 శాతం లెక్కించాల్సిందే’ : చంద్రబాబు
- BBC Fact Check: ఇందిరా గాంధీని వాజ్పేయీ 'దుర్గా' అని పిలిచేవారా...
- తక్కువ పని చేసే కళ... రాణించటమెలా?
- అంబేడ్కర్తో బీబీసీ అరుదైన ఇంటర్వ్యూ: 'సరైనవారు ఎన్నికైతేనే ఎన్నికలకు విలువ'
- మోదీ వ్యతిరేక 'నగ్న నిరసన'ను తమిళ రైతులు ఎందుకు విరమించుకున్నారు...
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)