ఇండియా లాక్డౌన్: 18 నెలల శిశువుతో 2 వేల కి.మీ. కాలినడకన వెళ్తున్న వలస కార్మికులు
చత్తీస్ఘడ్కు చెందిన ఈ వలస కూలీలు తమిళనాడు నుంచి తమ స్వస్థలాలకు కాలినడకన బయలుదేరారు.2000 కిలోమీటర్ల దూరంలో ఉన్న తమ సొంతూళ్లకు వీరు 18 నెలల శిశువుతో రెండోరోజు నడక ప్రారంభించారు.
‘‘మాకు ఎలాంటి వాహనం లేదు. మేమేం చేయగలం? అందుకే ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాం’’.
మరి ఆహారం, నీళ్లు ఎలా?‘‘ఆహారం మాకు ఎక్కడి నుంచి వస్తుంది? నిన్న బయల్దేరాం... నడుస్తూనే ఉన్నాం. తిండీ లేదు, నీళ్లూ లేవు. దారిలో ఏమైనా దొరుకుతాయేమో చూడాలి.’’
ఎందుకు ఇలా నడుచుకుంటూ వెళ్తున్నారు?
‘‘నా భర్త, కుటుంబం అక్కడే ఉన్నారు. ఇక్కడ పని కోసం నా కూతురు, నేను వచ్చాం. లాక్ డౌన్కు ముందు నా భర్త అక్కడకు వెళ్లారు. రవాణా లేకపోవడంతో అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది’’ అని ఒక మహిళా కూలీ చెప్పారు.
చెన్నై నుంచి బయల్దేరిన వీళ్లంతా ఆంధ్ర ప్రదేశ్ సరిహద్దు దాటారు. కొందరు రాత్రీ పగలూ కూడా నడుస్తుంటే, కొందరు పగలు విశ్రాంతి తీసుకుని, రాత్రి సమయంలో నడుస్తున్నారు.
కొందరు సైకిళ్లపై వెళ్తున్నారు. వాళ్లు ఎలాంటి ఆహారం, విశ్రాంతి లేకుండా ప్రయాణం సాగిస్తున్నారు.
సరిహద్దుల్లో పోలీసులు అడ్డుకోవడంతో సైకిళ్లతోపాటు ఆగిపోయిన ఎంతోమంది ఇక్కడ కనిపిస్తున్నారు.
తమ వాళ్లకు దూరంగా ఉండటం చాలా బాధగా ఉందని కొందరంటున్నారు.
వందల సంఖ్యలో మహిళలు తమ పిల్లలను ఎత్తుకుని, తమ స్వగ్రామాల వైపు నడుస్తున్నారు.
కరోనావైరస్ను నియంత్రించడంలో ప్రధాని మోదీ ఎలా వ్యవహరించారో వారిలో కొందరు చెప్పారు. వారేం చెప్పారో పై వీడియోలో చూడండి.
- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?
- కరోనావైరస్; ఎండ వేడి ఎక్కువగా ఉంటే వైరస్ నశిస్తుందా?
- కరోనావైరస్: వస్తువులు, ఇతర ఉపరితలాల మీద, గాలిలో ఈ వైరస్ ఎంత కాలం సజీవంగా ఉంటుంది?
- కరోనావైరస్ మన శరీరం మీద ఎలా దాడి చేస్తుంది? ఇది సోకిన వారిలో కొందరు చనిపోవడానికి కారణం ఏమిటి
- మాస్క్లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా
కరోనావైరస్ హెల్ప్లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్లైన్ నంబర్ 08046110007
ఇవి కూడా చదవండి:
- నేపాల్ లిపులేఖ్ మ్యాప్ వివాదంపై మనీషా కోయిరాలా ట్వీట్కు సుష్మా స్వరాజ్ భర్త ఎలా సమాధానం ఇచ్చారు?
- చైనాతో సరిహద్దు.. 9.7 కోట్ల జనాభా.. 300 కేసులు, ఒక్క మరణం కూడా లేదు.. వియత్నాం కమ్యూనిస్టు ప్రభుత్వం విజేతగా ఎలా నిలిచింది?
- సైక్లోన్ ఆంఫన్: కోల్కతాలో విలయం సృష్టించిన తుపాను
- టిక్టాక్ యాప్ను బ్యాన్ చేయాలని ఎందుకు డిమాండ్లు వస్తున్నాయి? వివాదం ఏంటి?
- కరోనావైరస్: ప్రపంచవ్యాప్తంగా 50 లక్షలు దాటిన కోవిడ్-19 కేసులు.. నాలుగు దేశాల్లోనే అత్యధికం
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)