ఇండియాలో ఒమిక్రాన్

ఇండియాలో ఒమిక్రాన్

భారత్‌లో తొలిసారి రెండు కోవిడ్-19 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి.

ఈ రెండూ కర్ణాటకలో వెలుగు చూశాయని కేంద్ర హోం శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ గురువారం వెల్లడించారు.

ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే అనేక దేశాల్లో వెలుగుచూసిన ఈ వేరియంట్‌ను భారత్‌లో గుర్తించడం ఇదే తొలిసారి.

ఈ విషయాన్ని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) డైరెక్టర్ జనరల్ బలరామ్ భార్గవ కూడా స్పష్టంచేశారు.

ఎవరూ భయపడాల్సిన అవసరంలేదని, అయితే, అందరూ చాలా అప్రమత్తంగా ఉండాలని బలరామ్ ట్వీట్ చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)