కెంటకీ టోర్నడో: 70 మందికిపైగా మృతి, ప్రాణనష్టం 100 దాటొచ్చంటున్న గవర్నర్ - Newsreel

ఫొటో సోర్స్, Reuters
టోర్నడో కారణంగా పట్టాలు తప్పిన రైలు
అమెరికాలోని కెంటకీలో భీకర సుడిగాలులకు(టోర్నడో) 70 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని ఆ రాష్ట్ర గవర్నర్ ఆండీ బెషీర్ వెల్లడించారు.
మృతుల సంఖ్య ఇంకా పెరగొచ్చని.. 100 దాటొచ్చని ఆయన అన్నారు.
కెంటకీ రాష్ట్ర చరిత్రలోనే ఇవి అత్యంత విధ్వంసకర టోర్నడోలని ఆయన తెలిపారు.
అమెరికాలోని అనేక రాష్ట్రాలలో టోర్నడోలు విధ్వంసం సృష్టిస్తుంటాయి.
తాజా టోర్నడోల కారణంగా ఇల్లినాయిస్లోని ఓ అమెజాన్ గోదాం పైకప్పు కూలిపోయి కార్మికులు అక్కడ చిక్కుకుపోయారు.
ఫొటో సోర్స్, Reuters
టోర్నడో తాకిడికి పైకప్పు ఎగిరిపోయిన భవనం
టోర్నడో విరుచుకుపడిన సమయంలో కెంటకీలోని మేఫీల్డ్లో ఒక కొవ్వొత్తుల పరిశ్రమలో 100 మందికిపైగా చిక్కుకుపోయారని 'న్యూయార్క్ టైమ్స్' తెలిపింది.
వారిలో కొందరి ప్రాణాలకు ప్రమాదమేర్పడవచ్చని గవర్నర్ అన్నారు.
పైకప్పులు కూలిపోవడం వల్ల ఎంతమంది చనిపోయారు, గాయపడ్డారనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు.
అయితే, ప్రాణనష్టం భారీగా ఉండొచ్చని స్థానిక అధికారులు, అత్యవసర విభాగాల వారు చెబుతున్నారు.
బెంగళూరు చేరుకున్న సాయితేజ మృతదేహం, రేపు స్వగ్రామంలో అంత్యక్రియలు
తమిళనాడు కున్నూరు సమీపంలో బుధవారం జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందిన చిత్తూరు జిల్లా కురబలకొట మండలం రేగడపల్లెకు చెందిన సాయితేజ మృతదేహం బెంగళూరుకు చేరుకుంది.
మృతదేహం ఆదివారం ఆయన స్వగ్రామం రేగడపల్లెకు చేరుకుంటుందని చిత్తూరు జిల్లా కలెక్టర్ ఎం.హరినారాయణన్ తెలిపారు.
ఆదివారం ఉదయం 9 గంటలకు రేగడ పల్లెలో సైనిక లాంఛనాలతో సాయితేజ దహన క్రియలు జరుగుతాయని తెలిపారు.
సాయితేజ మృతదేహం ప్రస్తుతం బెంగళూరులోని యల్హంక ఎయిర్ పోర్టులో ఉంది. దిల్లీ నుంచి తీసుకొచ్చిన మృతదేహాలతో మొదట కోయంబత్తూరు చేరుకున్న ప్రత్యేక విమానం అక్కడ రెండు మృతదేహాలను అప్పగించిన తర్వాత బెంగళూరు చేరుకుంది.
బెంగళూరు విమానాశ్రయంలో సైనిక వందనం
సాయితేజ తమ్ముడు మహేశ్ అభ్యర్థన మేరకు మృతదేహాన్ని బెంగళూరులోనే ఉంచి రేపు ఉదయం అంత్యక్రియలకు నేరుగా చిత్తూరు జిల్లాకు తీసుకురానున్నారు.
మరోవైపు, ఏపీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున సాయి తేజ కుటుంబానికి 50 లక్షల రూపాయల చెక్కును అందజేశారు.
ఇవి కూడా చదవండి:
- కొత్త సినిమాల టికెట్ ధరలు పెంచుకోవచ్చు - హైకోర్టు ఉత్తర్వులు
- 'సిరివెన్నెల సీతారామ రెడ్డి’కి ‘గురవయ్య శాస్త్రి’ నివాళి
- అన్నమయ్య ప్రాజెక్టు: డ్యాం కొట్టుకుపోయినా ప్రజలకు సమాచారమివ్వలేదా? సైరన్ మోగలేదా
- మోదీ ప్రభుత్వం కరోనా సంక్షోభం నుంచి ఆర్ధిక వ్యవస్థను బయటపడేసిందా?
- MSP: కనీస మద్దతు ధర అంటే ఏమిటి, రైతులు దీనికోసం ఎందుకు పట్టుబడుతున్నారు?
- తెలంగాణలో కరెంట్ బిల్లుల షాక్ తప్పదా? - ప్రెస్రివ్యూ
- 'కేంద్రం గుప్పిట్లో పౌరుల సమాచారం'
- కరోనా థర్డ్వేవ్ను ఎదుర్కొనేందుకు భారత్ తీసుకోవాల్సిన 5 చర్యలు..
- భారత్-పాక్ యుద్ధం-1971: రణరంగంలో భారత కమాండర్ రాసిన లేఖకు పాకిస్తాన్ అధికారి ఎలా బదులిచ్చారంటే...
- కరోనావైరస్ కొత్త వేరియంట్ పేరు 'ఒమిక్రాన్', ఆందోళనకరంగా ఉందన్న డబ్ల్యూహెచ్వో
- ఈ చిన్న అట్టపెట్టె లాంటి ఉపగ్రహాలు ప్రపంచాన్ని ఎలా మార్చేయబోతున్నాయి?
- హనుమ విహారి ఫౌండేషన్, ఎన్టీఆర్ ట్రస్టు మధ్య గొడవేంటి? ఈ క్రికెటర్ ట్విటర్ నుంచి ఎందుకు తప్పుకున్నాడు?
- 'ఇప్పుడే నీ చేతుల్లో చచ్చిపోయా'.. ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ విడాకులపై రూమర్లకు ఈ కామెంట్ సమాధానమా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)