బ్రిటన్: పద్నాలుగేళ్ల పాటు ఆహారంపై రేషన్
బ్రిటన్: పద్నాలుగేళ్ల పాటు ఆహారంపై రేషన్
బ్రిటన్లో 14 ఏళ్ల పాటు ప్రజలందరికీ ఆహారానికి పరిమిత కోటా (రేషన్) అమలు చేశారు. పసిపిల్లల పాలు, చాక్లెట్ల నుంచి టీ, కాఫీలతో పాటు మాంసాహారం వరకూ అన్నిటికీ రేషన్ విధించారు. దుస్తులు కూడా పరిమితంగానే కొనుక్కోవాలి. అందుకోసం రేషన్ పుస్తకాలను కూడా ప్రజలకు జారీచేశారు.
1939లో మొదలైన రెండో ప్రపంచ యుద్ధం కారణంగా బ్రిటన్లో ఆహార పదార్థాలకు కొరత తలెత్తింది. అప్పటికి బ్రిటన్లో లభ్యమయ్యే ఆహారంలో మూడో వంతు కన్నా తక్కువే ఆ దేశంలో ఉత్పత్తయ్యేది.
యుద్ధ కాలంలో బ్రిటన్కు నౌకల ద్వారా ఆహార పదార్థాలను దిగుమతి చేసుకోవడం కష్టంగా మారింది. శత్రు దేశాలు బ్రిటన్ ఆహార నౌకలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడం దీనికి కారణం.