షిన్‌జాంగ్‌లో లక్షలాది మంది వీగర్‌ ముస్లింలను చైనా ఎందుకు నిర్బంధిస్తోంది?

వీగర్‌ ముస్లిం

ఫొటో సోర్స్, Getty Images

దాదాపు పది లక్షలమంది వీగర్‌ ముస్లింలను చైనా నిర్బంధించినట్లు వార్తలొస్తున్నాయి. కోటికిపైగా ముస్లింలు ఉండే షిన్‌జాంగ్‌ ప్రావిన్సులో ఇలా జరుగుతున్నట్లు ఐక్యరాజ్య సమితి చెబుతోంది.

ఐఎస్ మిలిటెంట్లు, వేర్పాటువాదుల కారణంగా ఆ ప్రాంతంలో హింస చెలరేగుతోందని ప్రభుత్వ వాదన. నిర్బంధంలో ఉన్నవారు... అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు విశ్వసనీయతను తెలపాలనే ఒత్తిడి పెరుగుతోంది.

వీడియో క్యాప్షన్,

వీడియో: లక్షలాది ముస్లింలను చైనా ఎందుకు నిర్బంధిస్తోంది?

వీగర్‌ ముస్లిం వర్గానికి చెందిన ఓ వ్యక్తి తన బంధువును కలవడానికి ఓసారి జింజియాంగ్ వెళ్లారు. ‘వాళ్లు రోబోల్లా ఉన్నారు. తమ ఆత్మను కోల్పోయినట్లు కనిపించారు. వాళ్లంతా నాకు బాగా తెలుసు. కానీ గతంలో ఉన్నట్లు వాళ్లిప్పుడు లేరు’ అంటూ నిర్బంధ శిబిరంలో గడిపిన తమ బంధువుల గురించి ఆయన చెప్పారు.

మతపరమైన తీవ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు చైనా ఈ చర్యలు చేపడుతోంది. ముస్లింలలో అవగాహన పెంచేందుకే ప్రభుత్వం ఈ చర్యలని తీసుకుంటోందని కొందరు సాక్షులు చెబుతున్నారు. నిర్బంధ శిబిరాల్లో ఉన్నవారితో అధికార పార్టీ నినాదాలు చేయిస్తున్నట్లు తెలుస్తోంది.

శిబిరాల్లో వారికి సరైన ఆహారం ఇవ్వరని, హింసిస్తారని వరల్డ్ వీగర్‌ కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ప్రభుత్వం ఈ ఆరోపణలను ఖండిస్తోంది. కానీ అతివాదులపై కొన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెబుతోంది.

జింజియాంగ్‌ తరచూ హింసకు కేంద్రంగా మారుతోంది. దానికి తగ్గట్లే అణచివేత చర్యలు అమలవుతున్నాయి. ఈ నిర్బంధ శిబిరాల విధానాన్ని ఆపేయాలని ఐరాస చైనాను కోరుతోంది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)