జపాన్‌ అతలాకుతలం

జపాన్‌ అతలాకుతలం

టైఫూన్ జేబి ధాటికి జపాన్ అతలాకుతలమైంది. గత పాతికేళ్లలో ఎన్నడూ లేనంతగా జేబి ప్రభావం చూపిందని, ఇప్పటివరకు 10 మంది మృతిచెందారని, 300 మంది గాయపడ్డారని జపాన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి యొషిహిదె సూగా తెలిపారు.

అక్కడి ప్రధాన విమానాశ్రయాల్లో ఒకటైన ఒసాకాలోని కాన్సాయ్ అంతర్జాతీయ విమానాశ్రయమాన్ని తాత్కాలికంగా మూసివేశారు. అక్కడ చిక్కుకున్న వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

జపాన్ పశ్చిమ ప్రాంతంలో నష్టం తీవ్రంగా ఉంది. క్యోటో, ఒసాకా సహా పలు నగరాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది.

విమాన సర్వీసులు, రైళ్లు, ఫెర్రీలను రద్దు చేయడంతో వేలాది మంది ప్రయాణికులు ఎక్కడివారక్కడే నిలిచిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)