జపాన్ అతలాకుతలం
జపాన్ అతలాకుతలం
టైఫూన్ జేబి ధాటికి జపాన్ అతలాకుతలమైంది. గత పాతికేళ్లలో ఎన్నడూ లేనంతగా జేబి ప్రభావం చూపిందని, ఇప్పటివరకు 10 మంది మృతిచెందారని, 300 మంది గాయపడ్డారని జపాన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి యొషిహిదె సూగా తెలిపారు.
అక్కడి ప్రధాన విమానాశ్రయాల్లో ఒకటైన ఒసాకాలోని కాన్సాయ్ అంతర్జాతీయ విమానాశ్రయమాన్ని తాత్కాలికంగా మూసివేశారు. అక్కడ చిక్కుకున్న వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
జపాన్ పశ్చిమ ప్రాంతంలో నష్టం తీవ్రంగా ఉంది. క్యోటో, ఒసాకా సహా పలు నగరాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది.
విమాన సర్వీసులు, రైళ్లు, ఫెర్రీలను రద్దు చేయడంతో వేలాది మంది ప్రయాణికులు ఎక్కడివారక్కడే నిలిచిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇవి కూడా చదవండి:
- జపాన్ వరదలు: రికార్డు వర్షపాతంతో 141 మంది మృతి
- డైమండ్ నగరంలో 'గోల్డెన్ స్వీట్' - మరి రుచి చూస్తారా?
- ఆస్ట్రేలియా: పెట్రోలు అయిపోతోందా? అయిపోతే బండి నడిచేదెలా?
- ప్లాస్టిక్పై నిషేధం: ఆస్ట్రేలియాలో ఆగ్రహం
- పీవీ సింధు: ఆదాయంలో క్రికెట్ స్టార్లను వెనక్కు నెట్టిన బ్యాడ్మింటన్ స్టార్ క్రీడాకారిణి
- ఆసియా క్రీడలు: దీక్షా డాగర్.. అద్భుతమైన షాట్స్ కొట్టినా అభిమానుల చప్పట్లేమీ ఆమెకు వినపడవు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)