ఫ్లోరిడా: నగరం మొత్తం నీటిలో విషాన్ని కలిపేందుకు వాటర్ సిస్టమ్ను హ్యాక్ చేసిన హ్యాకర్

అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం ఓల్డ్స్మార్ నగర నీటి సరఫరా వ్యవస్థను హ్యాక్ చేసిన ఒక కంప్యూటర్ హ్యాకర్.. ఆ నీటిలోకి ప్రమాదకర స్థాయిలో రసాయనాలను కలిపేందుకు ప్రయత్నించారని అధికారులు చెప్పారు.
నగర వాటర్ ట్రీట్మెంట్ సిస్టమ్ను హ్యాక్ చేసి అందులో కలిపే సోడియం హైడ్రాక్సైడ్ మోతాదును పెంచగా.. ఒక ఉద్యోగి గుర్తించి వెంటనే ఆ చర్యను తిప్పికొట్టారు.
నీటిలో అసిడిటీని నియంత్రించటానికి సోడియం హైడ్రాక్సైడ్ను స్వల్ప మోతాదులో ఉపయోగిస్తారు. దీనిని ఎక్కువ మోతాదులో కలిపితే పెద్ద సమస్యలను కలిగిస్తుంది.
ఓల్డ్స్మార్ వాటర్ ట్రీట్మెంట్ సిస్టమ్ను శుక్రవారం నాడు హ్యాక్ చేశారు. ఉదయం విధుల్లో ఉన్న ప్లాంట్ ఆపరేటర్ ఒకరు.. సిస్టమ్ను యాక్సెస్ చేయటానికి జరుగుతున్న ప్రయత్నాన్ని గుర్తించారు. అయితే అది తన సూపర్వైజర్ అని భావించారని టాంపా బే టైమ్స్ ఒక కథనంలో వివరించింది.
అయితే.. మధ్యాహ్నం మరోసారి ప్రయత్నించిన హ్యాకర్ సాఫ్ట్వేర్లోకి చొరబడ్డాడు. నీటిలో కలిపే సోడియం హైడ్రాక్సైడ్ మోతాదును 100 పీపీఎం (పార్ట్స్ పెర్ మిలియన్) నుంచి 11,100 పీపీఎంకు పెంచాడు.
ఈ పెరుగుదలను గుర్తించిన ఆపరేటర్ తక్షణమే దానిని రివర్స్ చేసి.. సాధారణ స్థాయికి తగ్గించాడు.
నీటిలో ఈ రసాయనం మోతాదు పెరిగితే.. ఆ నీరు తాకిన చర్మం, కళ్లకు ఇరిటేషన్ కలిగిస్తుంది. జుట్టు తాత్కాలికంగా ఊడిపోగలదు. అదే నీటిని తాగితే నోరు, గొంతు, పొట్టలు దెబ్బతింటాయి. వాంతులు, కళ్లుతిరగటం, విరేచనాలు కూడా కలిగించగలదు.
దుష్ట శక్తులు పొంచివున్నాయి...
ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకూ ఎలాంటి అరెస్టులు చేయలేదు. ఈ హ్యాకింగ్ అమెరికాలో నుంచే జరిగిందా, దేశం వెలుపలి నుంచి జరిగిందా అనేదీ ఇంకా తెలియలేదు.
‘‘దుష్ట శక్తులు పొంచి ఉన్నాయి’’ అని ఓల్డ్స్మార్ మేయర్ ఎరిక్ షీల్డెల్ వ్యాఖ్యానించారు.
ఓల్డ్స్మార్ వాటర్ ప్లాంటు.. దాదాపు 15,000 మంది నగరవాసులకు, వ్యాపార సంస్థలకు నీటిని సరఫరా చేస్తుంది.
తాజా పరిణామం నేపథ్యంలో ప్లాంటు రిమోట్ యాక్సెస్ ప్రోగ్రామ్ను తాత్కాలికంగా ఆపివేశారు.
2016లో అమెరికాలోని మరొక నీటి ప్లాంటులో కూడా ఇదే తరహా సైబర్ దాడి జరిగిందని బీబీసీ సైబర్ రిపోర్టర్ జో టైడీ తెలిపారు.
2020లో ఇజ్రాయెల్లోని పలు నీటి సరఫరా కేంద్రాలపై పలుమార్లు ఇలాంటి దాడి ప్రయత్నాలు జరిగాయని, కానీ విఫలమయ్యాయని వివరించారు.
దేశంలోని ‘‘కీలకమైన జాతీయ మౌలికసదుపాయాల వ్యవస్థల’’ను లక్ష్యంగా చేసుకుని సైబర్ దాడులు జరిగే అవకాశం ఉందని సైబర్ భద్రత నిపుణులు అనేక సంవత్సరాలుగా హెచ్చరిస్తున్నారు. తాజా సైబర్ దాడి వారి ఆందోళనలను మరింతగా పెంచింది.
నీరు, విద్యుత్, అణు విద్యుత్ ప్లాంట్లు, రవాణా వ్యవస్థల్లో సైబర్ భద్రతా లోపాల కోసం ఎప్పటికప్పుడు పరిశోధన చేపడుతూనే ఉంటారు. ఇందుకు.. వీటిలో కాలం చెల్లిన ఐటీ వ్యవస్థలను ఉపయోగిస్తుండటం ఒక కారణమైతే.. వాటిపై దాడివల్ల సంభవించే సామూహిక నష్టం మరొక కారణం.
ఇప్పటివరకూ నీటి సరఫరాల మీద జరిగిన సైబర్ దాడులన్నిటినీ నివారించారు.
కానీ మేయర్ సీడెల్ చెప్పినట్లుగా.. ‘‘దుష్టశక్తులు పొంచివున్నాయని అందరినీ అప్రమత్తం చేసిన దాడి ఇది’’.
ఇవి కూడా చదవండి:
- సస్పెన్స్ థ్రిల్లర్ను తలపించే తేయాకు కథ: చైనా నుంచి టీ రహస్యాన్ని ఆంగ్లేయులు ఎలా దొంగిలించారు?
- ‘సోషల్ మీడియాలో సవాళ్లకు టెంప్ట్ అవుతున్నారా.. జాగ్రత్త కపుల్స్’
- ఇండియాలో కరోనావైరస్ వ్యాప్తి పతాక స్థాయికి చేరిందా? సెకండ్ వేవ్ ఉంటుందా?
- బొప్పాయి పండుతో అబార్షన్ ఎలా చేయాలో నేర్పిస్తున్నారు
- సంజయ్ గాంధీకి బలవంతంగా కుటుంబ నియంత్రణ చేస్తారని ఇందిర భయపడిన రోజు..
- ‘కలకత్తా’లో వేశ్యలకు బలవంతంగా జననేంద్రియ పరీక్షలు
- ప్రపంచంలో విదేశాలపై ఆధారపడని ఏకైక ‘దేశం’ ఇదేనా?
- బతికుండగానే ఫ్రీజర్లో పెట్టారు.. అయినా బతికాడు.. కానీ..
- యూరప్ అణు కేంద్రంలో నటరాజ విగ్రహం ఎందుకుంది, సోషల్ మీడియా దాని గురించి ఏమంటోంది?
- ఘోస్ట్ ఐలాండ్: 'మానవజాతి అంతమైపోయాక భూమి ఇలాగే ఉండొచ్చు'
- ‘నాన్లోకల్ లీడర్ల’ అడ్డాగా విశాఖ... నగరంలో 30 ఏళ్లుగా వారి హవా సాగుతుండటానికి కారణాలేంటి?
- వీరప్పన్ కేసుల్లో 31 ఏళ్లుగా శిక్ష అనుభవిస్తున్నవారి కథేమిటి.. గంధపు చెక్కల స్మగ్లర్ నేరాల్లో వారి పాత్రేమిటి
- చైనా టిబెట్ ఆక్రమణకు 70 ఏళ్లు: అసలు హిమాలయాల్లో ఘర్షణ ఎందుకు మొదలైంది?
- ‘బందిపోటు’ పోలీసులు.. హత్యలు, దోపిడీలతో చెలరేగిపోతున్నారు
- బెంగళూరులో పది లక్షల బావులు ఎందుకు తవ్వుతున్నారు?
- ‘మాకు #MeToo తెలియదు... ఇల్లు, రోడ్డు, పనిచేసే చోటు ఏదీ మాకు సురక్షితం కాదు’
- మొరటు శృంగారానికి, లైంగిక దాడికి తేడా ఏంటి?
- చైనాలో మహిళలకు మాత్రమే పరిమితమైన రహస్య భాష... నుషు
- ఓ డొక్కు టీవీ ఊరు మొత్తానికీ ఇంటర్నెట్ రాకుండా చేసింది.. ఎలాగంటే...
- మీ పాత టీవీ, రేడియో అమ్మితే రూ. 10 లక్షలు.. ఏమిటీ బేరం
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)